ప్రభుత్వ ఉద్యోగుల డీఏని ప్రతియేటా రెండుసార్లు (జనవరి, జులై) సవరిస్తుంది కేంద్రం. అనంతర నెలల్లో వీటిపై ప్రకటనలు వెలువడతాయి. పండుగ సీజన్ కూడా సమీపిస్తుండటంతో ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై త్వరలోనే, ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్ నెలలోనే ఓ ప్రకటన వస్తుందని అంచనాలు ఉన్నాయి. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా, దాని అమలు మాత్రం 2024 జులై నుంచే ఉంటుంది. ఫలితంగా 7వ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఉండే డీఏ పెంపుతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధిచేకూరనుంది. ఈ ఏడాది 2024 మార్చ్లో డీఏ పెంపు జరిగింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా నెలలకు ఏరియర్స్ పడతాయి.