ప్రభుత్వ ఉద్యోగుల డీఏని ప్రతియేటా రెండుసార్లు (జనవరి, జులై) సవరిస్తుంది కేంద్రం. అనంతర నెలల్లో వీటిపై ప్రకటనలు వెలువడతాయి. పండుగ సీజన్​ కూడా సమీపిస్తుండటంతో ఈ ఏడాది రెండో డీఏ పెంపుపై త్వరలోనే, ఇంకా చెప్పాలంటే సెప్టెంబర్​ నెలలోనే ఓ ప్రకటన వస్తుందని అంచనాలు ఉన్నాయి. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడు వచ్చినా, దాని అమలు మాత్రం 2024 జులై నుంచే ఉంటుంది. ఫలితంగా 7వ పే కమిషన్​ సిఫార్సుల ఆధారంగా ఉండే డీఏ పెంపుతో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధిచేకూరనుంది. ఈ ఏడాది 2024 మార్చ్​లో డీఏ పెంపు జరిగింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఆయా నెలలకు ఏరియర్స్​ పడతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here