నెలకోసారి ప్రభుత్వ హాస్టళ్లలో నిద్ర చేయాలి..

తాజాగా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీలక ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని రెసిడెన్షియల్‌ పాఠశాలలు, హాస్టళ్లల్లో తనిఖీలు చేయాలని సూచించారు. నెలకు ఒకసారి.. కలెక్టర్లు రెసిడెన్షియల్స్‌, హాస్టల్స్‌లో నిద్ర చేయాలని స్పష్టం చేశారు. స్కూల్స్‌, హాస్టల్స్‌ తనిఖీల్లో తీసుకున్న చర్యలను డైరీలో రాయాలని సూచించారు. రాత్రి హాస్టళ్లలో కలెక్టర్లు బస చేస్తే.. వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని.. అప్పుడే విద్యార్థుల సమస్యలు పరిష్కరించవచ్చని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here