కేంద్ర కేబినెట్ ఆమోదం

నూతన పింఛను పథకం (NPS) లో మార్పులు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేయడంతో కేబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఓ కమిటీని ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వివిధ సంస్థలు, దాదాపు అన్ని రాష్ట్రాలతో 100కు పైగా సమావేశాలు నిర్వహించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రపంచ బ్యాంకు సహా అందరితో సంప్రదింపుల అనంతరం ఏకీకృత పెన్షన్ పథకానికి కమిటీ సిఫారసు చేసింది. ఈ ఏకీకృత పెన్షన్ పథకానికి (Unified Pension Scheme) కేంద్ర కేబినెట్ శనివారం ఆమోదం తెలిపింది. ఇది త్వరలో అమలు కాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here