మంత్రి లేఖ..
నాగార్జున ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణం అని.. ఈ నెల 21న సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలోని అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ హైడ్రాను ఆదేశించారు. దీంతో కోమటిరెడ్డి లేఖపై హైడ్రా కమిషనర్ విచారణ జరిపారు. తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్టీఎల్లో ఎన్ కన్వెన్షన్ నిర్మించినట్లు మంత్రి లేఖలో వివరించారు. శాటిలైట్ ఫోటోలతో సహా ఇతర ఆధారాలను హైడ్రాకు ఇచ్చారు. కోమటిరెడ్డి లేఖపై విచారణ జరిపిన హైడ్రా.. కూల్చివేతకు రంగం సిద్ధం చేసి నేలమట్టం చేసింది.