హైడ్రా రిపోర్ట్..
కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా రిపోర్ట్ ఇచ్చింది. 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. పల్లంరాజు, అక్కినేని నాగార్జున, సునీల్ రెడ్డి కట్టడాలను కూల్చివేసినట్టు స్పష్టం చేసింది. చింతల్లో బీఆర్ఎస్ నేత రత్నాకర్ రాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్ట్లో వెల్లడించింది. లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్నగర్, గాజులరామారం, అమీర్పేట్లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా రిపోర్ట్లో వివరించింది.