‘పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టువ్యాధి గ్రస్తులూ, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి.. వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతా మూర్తి మదర్ థెరిసా. ఎంతో మంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపడమే కాదు.. అనాథ, పేద పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పించి వారి భవిషత్తుకు బంగారు బాటలు వేసిన మహోన్నత వ్యక్తి ఆమె. మన ప్రభుత్వ హయాంలో విజయవాడ నగరంలోని నిర్మల్ హృదయ్ భవన్ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా.. వారికి సహాయ సహకారాలు అందించాం. ఆ భవనం కాంప్లెక్స్ను ఆ రోజు నేను ప్రారంభించండం సంతోషంగా ఉంది. నేడు మదర్ థెరిసా జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
Home Andhra Pradesh వైఎస్ జగన్-ys jagan mohan reddy tributes on mother teresa birth anniversary ,ఆంధ్ర...