ఇటీవలే రాజేష్ మృతి..
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఏరుకొండ నీలమ్మ, సాంబయ్య దంపతులకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు ఏరుకొండ రాజేష్ (32) కొంత కాలం కిందట ఎంఎస్ చదివేందుకు అమెరికాలోని మిస్సిస్సిపి రాష్ట్రానికి వెళ్లాడు. చదువులు పూర్తి చేసి ఇప్పుడు అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉండగా కొద్ది రోజుల కిందట రాజేష్ కాలికి గాయమైంది. దీంతో దానికి సంబంధించిన చికిత్స తీసుకున్న రాజేష్ అదే విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. ఇంతలోనే ఏం జరిగిందో కానీ రాజేష్ అనారోగ్యంతో మృతి చెందాడు.