భారీ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కించడం ఈమధ్య కామన్ అయిపోయింది. అయితే రాను రాను ఇది మూడు భాగాల ట్రెండ్ గా మారేలా ఉంది. ‘పుష్ప’ (Pushpa) సినిమాకి పార్ట్-3 కూడా ఉంటుందని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమేనని, పుష్ప-3 ఖచ్చితంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ వినిపిస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. వరల్డ్ వైడ్ గా రూ.360 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం పుష్పకి రెండో భాగంగా ‘పుష్ప: ది రూల్’ (Pushpa The Rule) తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘పుష్ప-2’ నుంచి విడుదలైన గ్లింప్స్ కి, టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సంచలనాలు సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి.

ఇదిలా ఉంటే, పుష్ప చిత్రానికి మూడో భాగం కూడా ఉందట. ఇప్పటికే మూడో భాగానికి ‘పుష్ప: ది రోర్’ (Pushpa The Roar) అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారట. అయితే ఈ మూడో భాగం ‘పుష్ప-2’ విడుదలైన వెంటనే ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా కమిటై ఉన్నాడు. మరోవైపు సుకుమార్ కూడా తన తదుపరి సినిమాని రామ్ చరణ్ తో చేయాల్సి ఉంది. మరి బన్నీ,సుకుమార్ లు ముందు ‘పుష్ప-3’ పూర్తి చేసి ఇతర ప్రాజెక్ట్స్ పైకి వెళ్తారా? లేక ముందుగా వేరే ప్రాజెక్ట్స్ చేసి, కాస్త గ్యాప్ తర్వాత ‘పుష్ప-3’ చేస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

కాగా, ‘కేజీఎఫ్’ సినిమాకి కూడా పార్ట్-3 ఉంటుందని అధికారిక ప్రకటన వచ్చింది. కానీ హీరో యష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యారు. దీంతో ‘కేజీఎఫ్-3’ స్టార్ట్ అవడానికి చాలా టైం పట్టే అవకాశముంది. మరి బన్నీ-సుకుమార్ అదే బాటలో పయనిస్తారో లేక ‘పుష్ప-2’ విడుదలైన వెంటనే ‘పుష్ప-3’తో బిజీ అవుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here