పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)నుంచి ఎస్‌జే సూర్య డైరెక్షన్ లో  2001  లో వచ్చిన  ఖుషి(khushi) పవన్ ఇమేజ్ ని హిమాలయ శిఖరాలకి చేర్చడమే కాకుండా యూత్ మొత్తం పవన్ నామధేయంతో ఉగిపోయేలా  చేసింది. ఇండస్ట్రీ లో ఎన్నో సరికొత్త రికార్డులని కూడా నెలకొల్పిన ఈ మూవీ మీద ఒక హీరోయిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

 నాచురల్ స్టార్ నాని(nani)అప్ కమింగ్ మూవీ సరిపోదా శనివారం. ప్రియాంక మోహన్(priyanka mohan)హీరోయిన్ కాగా ప్రముఖ దర్శకుడు ఎస్ జె సూర్య(sj surya)ప్రతి నాయకుడుగా కనిపిస్తున్నాడు.ఇక  అగస్ట్ 29 న విడుదలకి సిద్ధం అవుతుండగా  రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా  ప్రియాంక  మాట్లాడుతు ప్రస్తుతం సీక్వెల్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో ఖుషి పార్ట్ 2 చెయ్యాలని  ఎస్‌జే సూర్యను కోరారు.ఒకవేళ చేస్తే పవన్ కళ్యాణ్‌తోనే చేయండి అంటూ  కోరారు.అదే విధంగా  సూర్య ప్రస్తుతం డైరెక్షన్‌ను పక్కనపెట్టి నటుడిగా బిజీ అయ్యారని, దీంతో మళ్లీ ఎప్పుడు మెగా ఫోన్ పట్టుకుంటారని కూడా  ప్రియాంక అడిగారు.  ప్రస్తుతం ప్రియాంక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

పవన్ ఫ్యాన్స్ కూడా ఖుషి-2 చేయాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చెయ్యడంతో పాటుగా ప్రియాంక చెప్పినట్టుగా పవన్ ని మాత్రమే ఖుషి 2 కి ఉహించుకోగలం అని అంటున్నారు. మరి ప్రియాంక అండ్ పవన్ ఫ్యాన్స్ కోరిక నెరవేరుతుందో లేదో తెలియదు కానీ  ఖుషి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్‌ను దృష్టిలో ఉంచుకుని ఓ స్క్రిప్ట్ రాసాను.  అది కూడా ప్రేమ కథే.  కథ విని  పవన్ కూడా బాగుందన్నారు.  కానీ  లవర్‌బాయ్‌గా  కనిపించాలని  తనకు లేదని  పవన్  రిజెక్ట్ చేశారని ఎస్‌జే సూర్య గతంలో ఒకసారి  చెప్పాడు.సెకండ్ రిలీజ్‌లోను ఖుషి  దాదాపు 7.46 కోట్ల కలెక్షన్స్ సాధించి  సరికొత్త రికార్డులు సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here