యాదాద్రి భువనగిరి జిల్లా:
తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ( Jishnu Dev Varma ) యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు.ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

 Governor Of Telangana Visited Yadadri ,jishnu Dev Varma, Telangana Governor ,-TeluguStop.com

గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌ అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.ఆ తర్వాత పండితులు వేదాశీర్వచనం పలికారు.

గవర్నర్‌ను శేషవస్త్రంతో సత్కరించి,స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం దాతల నుంచి విరాళాల సేకరణకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని గవర్నర్‌ ప్రారంభించారు.

రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిష్ణుదేవ్‌ వర్మ యాదాద్రికి వెళ్లడం ఇదే తొలిసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here