ఒక్కో షేరుకు రూ.1,601 ఇష్యూ ధరతో 6.25 మిలియన్ ఈక్విటీ షేర్లను క్యూఐపీకి కేటాయించినట్లు జెన్ టెక్నాలజీస్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్​లో తెలిపింది. జెన్ టెక్నాలజీస్ క్యూఐపీని 2024 ఆగస్టు 21న ప్రారంభించి 2024 ఆగస్టు 23న మూసివేసింది. దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల మధ్య పోటీ నెలకొనడంతో ఇష్యూ దాదాపు 5 సార్లు ఓవర్ సబ్​స్క్రైబ్ అయింది. కోటాక్ మ్యూచువల్ ఫండ్, వైట్ ఓక్ ఆఫ్షోర్ ఫండ్, వైట్ ఓక్ మ్యూచువల్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ ఈ క్యూఐపీలో పాల్గొన్న ప్రధాన ఇన్వెస్టర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here