ఒవైసీ, మల్లారెడ్డి కాలేజీలపై
హైడ్రా రాజకీయాలకు పావుగా మారదలుచుకోలేదని ఏవీ రంగనాథ్ తెలిపారు. ఒవైసీ, మల్లారెడ్డి అని వ్యక్తులను చూడమని, కాలేజీ కాబట్టి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచిస్తామన్నారు. చెరువులను ఆక్రమించి కాలేజీలు వాళ్ల పొరపాటన్నారు. చెరువుల పరిరక్షణ ముఖ్యమైన అంశమే, కానీ దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ఇంకా ముఖ్యమన్నారు. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వారికి తగిన సమయం ఇస్తామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో ఉంటే ధర్మసత్రాలైనా కూల్చివేస్తామన్నారు. హైడ్రా నోటీసులు ఇవ్వదని, డైరెక్ట్ గా కూల్చివేయడమేనని స్పష్టం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు, నేతలు మంగళవారం హైడ్రా కమిషనర్ ను కలిశారు. హైదరాబాద్ లోని పలు చెరువులు, పార్కుల ఆక్రమణలపై బీజేపీ కార్పొరేటర్లు కమిషనర్ను ఫిర్యాదు చేశారు.