సెప్టెంబర్ 18 నుంచి..

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పార్టీకి నాయకత్వం వహిస్తానని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా ఆగస్టు 16న ప్రకటించారు. కశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ కు బలమైన పట్టు ఉన్న ప్రాంతాల్లో గండేర్ బల్ కూడా ఒకటి. 1977లో నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ మహమ్మద్ అబ్దుల్లా, 1983, 1987, 1996లో ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా, 2008లో ఒమర్ అబ్దుల్లా ఈ నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యారు. ఎన్సీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009 నుంచి 2014 వరకు ప్రాతినిధ్యం వహించిన గండేర్ బల్ అసెంబ్లీ స్థానానికి ఒమర్ అబ్దుల్లా సహా, మొత్తం 32 మంది అభ్యర్థుల జాబితాను ఎన్సీ మంగళవారం విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here