కేసీఆర్ బిడ్డను తప్పు చేసే ప్రసక్తే లేదు -కవిత
జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. మేం పోరాట యోధులమని, న్యాయపరంగా, రాజకీయంగా పోరాడుతామన్నారు. తనకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. దాదాపు 5 నెలల తర్వాత ఇవాళ నా కొడుకు, అన్న, భర్తను కలిసిన తర్వాత ఉద్వేగానికి లోనయ్యానన్నారు. ఈ పరిస్థితికి రాజకీయాలే కారణమన్నారు. నన్ను జైలులో పెట్టడం వల్ల ఇంకా జగమొండిగా మారానన్నారు. తానుఎలాంటి తప్పు చేయలేదన్నారు. తన పోరాటం కొనసాగుతోందన్నారు.