వేర్వేరు కేసులు నమోదు..
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, మనీలాండరింగ్కు సంబంధించి.. సీబీఐ, ఈడీ వేర్వేరుగా కేసులు నమోదు చేశాయి. మార్చి 15న హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని ఆమె నివాసం నుంచి కవిత(46)ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏప్రిల్ 11న తీహార్ జైలు నుంచి ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను కవిత ఖండించారు. తాను ఏ పొరపాటు చేయలేదని స్పష్టం చేశారు.