రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఛార్మినార్, కాకతీయ కళాతోరణాలతో రాష్ట్ర అధికార చిహ్నాన్ని రూపొందించింది. అందులో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని, అందులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులతో సమావేశమై అధికార చిహ్నంపై పలుమార్లు చర్చలు జరిపారు. 1969లో తొలి దశ ఉద్యమం జరగగా, ఆనాటి ఆనవాళ్లు, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా అధికార చిహ్నం ఉండాలని తీర్మానించారు.