చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు, రిషిత, మేఘన హీరోహీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన “నేను-కీర్తన” (Nenu Keerthana) ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు రమేష్ బాబు మాట్లాడుతూ… “నేను-కీర్తన చిత్రం కోసం నేను ఎంతగానో శ్రమించాను. దర్శకుడిగా హీరోగా నా శ్రమకు తగ్గ ఫలితం లభించి, చాలా మంచి పేరు తెస్తుందనే నమ్మకం నాకుంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాటలతోపాటు… ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. రెండున్నర గంటలపాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్ చేసే మల్టీ జోనర్ ఫిల్మ్ ఇది. ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

రిషిత, రేణుప్రియ, సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్, మంజునాథ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.ఎల్.రాజా సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా కె. రమణ, ఎడిటర్ గా వినయ్ రెడ్డి బండారపు వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here