డయాబెటిస్ ఉన్నవారే కాదు, డయాబెటిస్ లేని వారు కూడా కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కొర్రలను తరచూ తినడం వల్ల అనేక రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు వంటివి రావు. కాబట్టి ఆర్థరైటిస్తో బాధపడేవారు కూడా కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవాలి. కొర్రల్లో ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉంటుంది. కాబట్టి కొర్రలను తరచూ తింటే రక్తహీనత సమస్య రాదు. ఇలా కొర్రల పులావ్ను వండి పిల్లలకు తినిపించడం చాలా ముఖ్యం. బరువు తగ్గాలనుకుంటున్నా వారు కొర్రల పులావ్ను ప్రయత్నించండి.