ఉస్మానియా ఆసుపత్రిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. గోషామహల్లో కొత్త భవనం ఏర్పాటు చేయాలన్నారు. 32 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడున్న ఉస్మానియా ఆస్పత్రి చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.