మరోవైపు అమెజాన్ ఇండియా హెడ్ మనీష్ తివారీ ప్రస్తుతం తన నోటీసు పిరియడ్లో ఉన్నారు. తివారీ అక్టోబర్లో అమెజాన్ను వీడనున్నారు. అమెజాన్ ఇండియాలో పీసీ, ఆడియో, కెమెరా, లార్జ్ అప్లయెన్సెస్ వ్యాపారాన్ని చూసుకుంటున్న నిశాంత్ సర్దానాకు క్విక్ కామర్స్ బిజినెస్ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రంజీత్ బాబు ఇకపై కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, లార్జ్ అప్లయెన్సెస్, వైర్లెస్తోపాటు ఇతర వాటికి నేతృత్వం వహించనున్నారు. అయితే ఈ ఊహాగానాలపై కంపెనీ స్పందించలేదని అమెజాన్ ఇండియా ప్రతినిధి ఒకరు ఈటీకి తెలిపారు.