పన్నెండు జ్యోతిర్లింగాలు

భారతదేశంలో పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవి అత్యంత శక్తివంతమైనవి, పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలు భారతదేశం అంతటా తూర్పు నుంచి పడమర, ఉత్తరం నుంచి దక్షిణం వరకు విస్తరించి ఉన్నాయి. గుజరాత్‌లో సోమనాథ్ జ్యోతిర్లింగం, ఆంధ్రప్రదేశ్‌లో మల్లికార్జున జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్‌లో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్‌లో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని భీమశంకర్ జ్యోతిర్లింగం, ఉత్తర ప్రదేశ్ లోని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, ఝార్ఖండ్ లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్‌లోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ, తమిళనాడులోని రామేశ్వర్ జ్యోతిర్లింగ, మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here