గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ప్రభుత్వానికి,నిర్వాహకులకు మధ్య సమన్వయం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం అధికారులతో సమీక్షించిన ఆయన..ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని స్పష్టం చేశారు. దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందిచాలన్నారు.