అమ్మ భాషపై విద్యార్థులకు ఆసక్తి పెంచేలా..
వేంకట కృష్ణారావు కేవలం ఉద్యోగం చేసి ఊరుకునేవారు కాదు. విద్యార్థులకు తెలుగు భాషపై పట్టు పెంచేందుకు కూడా కృషి చేశారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలను నిర్వహించి.. బహుమతులు అందజేస్తూ.. ప్రోత్సహించేవారు. ఇందు కోసం తన సొంత డబ్బును ఖర్చు చేశారు. అంతేకాదు.. ఎవరైనా తెలుగుకు సంబంధించిన పుస్తకాలు కావాలంటే.. సమకూర్చేవారు.