లాభాల్లో ఈ పీఎస్యూ లు..

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (National Hydroelectric Power Corp) 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8,405 కోట్ల వార్షిక టర్నోవర్, రూ.3,744 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే మంత్రిత్వ శాఖ పరిధిలోని సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ రూ.2,833 కోట్ల టర్నోవర్, రూ.908 కోట్ల లాభం సాధించింది. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SEC) 2024 ఆర్థిక సంవత్సరంలో రూ .436 కోట్ల నికర లాభంతో రూ .13,035 కోట్ల వార్షిక టర్నోవర్ ను నమోదు చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే రైల్ టెల్ (RAILTEL) వార్షిక టర్నోవర్ రూ.2,622 కోట్లు, లాభం రూ.246 కోట్లుగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here