పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ లిస్ట్ లో ఉన్న మూవీస్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 2 న పవన్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ అభిమానులకి ఒక గుడ్ న్యూస్ ని చెప్పింది.
ఉస్తాద్ ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్న విషయం అందరకి తెలిసిందే. రీసెంట్ గా చిత్ర బృందం ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ని ఇచ్చింది.షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుంది. పవన్ కంటిన్యూగా డేట్స్ ఇస్తే డిసెంబర్ నాటికి షూటింగ్ కూడా కంప్లీట్ చేస్తామని తెలిపింది. అలాగే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా ఒక స్పెషల్ ట్రీట్ ని అందిస్తున్నట్టుగా కూడా తెలియచేసింది.దీంతో పవన్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చినట్లయ్యింది. ఎలక్షన్స్ కి ముందు రిలీజ్ అయిన ఉస్తాద్ టీజర్ ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే.
ఉస్తాద్ డైరెక్టర్ హరీష్ శంకర్ గత చిత్రం మిస్టర్ బచ్చన్ ఘోర పరాజయాన్ని చవి చూడటంతో ఉస్తాద్ పై అందరిలో క్యూరియాసిటీ నెలకొని ఉంది.దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా పవన్ కి జోడిగా శ్రీలీల ఆడిపాడనుంది. ఇక ఇక్కడ ఇంకో ఆసక్తి కర విషయం ఏంటంటే పవన్ , అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తున్న టైం లో పుష్ప 2 కి ఉస్తాద్ కి మైత్రి వారే నిర్మాతలు.