పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పిఠాపురం ఎమ్మెల్యేగా( Pithapuram MLA ) హోదా సొంతం చేసుకున్నప్పటి నుంచి తన రాజకీయ ప్రయాణం చాలా సాఫీగా కొనసాగుతుంది.

 Deputy Cm Pawan Gave Special Gifts To The Women Of Pithapuram, Pawan Kalyan, Lat-TeluguStop.com

అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు అదిరిపోయే గిఫ్ట్ ను ఇచ్చారు.పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నోముకునే వారికి 12,000 మందికి చీరలు వ్రత పూజ సామాగ్రి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలో నేడు ఆరోవేల మందికి బహుమతులు అందజేశారు.

పిఠాపురంలోని పాదగయాలోని పూర్ణాహుతిగా ఆలయం వద్ద ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు ఆలయంలో ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాలు ( Varalakshmi Vratas )నిర్వహిస్తూ ఉంటారు.పిఠాపురం ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షణలో చీరలు అందజేస్తున్నట్లు సమాచారం.పవన్ కళ్యాణ్ ఒక సంచిలో “పిఠాపురం ఆడపడుచులకు మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి పసుపు – కుంకుమ కానుక” పేరిట బహుమతులు అందజేస్తున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఆలయం దగ్గర వరలక్ష్మి వ్రత పూజ ముగిసిన అనంతరం 6000 చీరలను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా అక్కడి వారి అందరికీ అందజేశారు.

ఈ కార్యక్రమంలో మొత్తం మూడు టీములుగా మహిళలు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అంటూ ఆలయ అధికారులు తెలియజేశారు.

ఈ సందర్బంగా వరలక్ష్మి వ్రతం కోసం ఆలయంలో భారీ ఏర్పాట్లు చేసామని.ఆలయ ఈవో భవాని మీడియాకు తెలిపారు.ఈ ఏడాది గుడి దగ్గర మరింత విశాలమైన స్థలాన్ని మహిళలకి అందుబాటులో ఉంచామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here