కోనో కార్పస్ చెట్ల వల్ల కలిగే హాని

ఈ మొక్కలను నాటడం వల్ల పర్యావరణానికీ, మనిషికి కూడా ఎంతో నష్టం జరుగుతుంది. ఈ చెట్లు అధికంగా పెంచితే అవి భాష్పీభవన ప్రక్రియను వేగవంతం చేస్తాయి. దాని వేళ్లు భూమిలో ఉన్న డ్రైనేజీ పైపుల్ని కూడా నాశనం చేస్తాయి. ఈ మొక్క రెండు సంవత్సరాల్లో రెండుసార్లు పరాగసంపర్కం చేస్తుంది. ఇది మానవ ఆరోగ్యానికి ఎంతో హానికరం. పరాగసంపర్కం చేసేటప్పుడు వచ్చే పుప్పొడి మనుషుల్లో దగ్గు, జలుబు, ఉబ్బసం, శ్వాసకోశ రుగ్మతలు అధికంగా వచ్చేలా చేస్తాయి.ఇవి ఎంతో మొండి మొక్కలు. ఒక్కసారి వేశామంటే అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకొని పెరిగేస్తాయి. ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. అందుకే ఇవి ఒక్కసారి నాటితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోయినా పెరిగేస్తాయి. చెట్లుగా ఎదిగిపోతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here