నందమూరి హరికృష్ణ, శాలిని దంపతుల ముద్దుల తనయుడు జూనియర్‌ ఎన్టీఆర్‌. విశేషం ఏమిటంటే.. ఎన్టీఆర్‌ తల్లిదండ్రులిద్దరూ ఒకేరోజు పుట్టారు. అంటే ఇద్దరి పుట్టినరోజు సెప్టెంబర్‌ 2. ఎన్టీఆర్‌ తల్లి శాలినికి ఎప్పటి నుంచో సొంత ఊరికి వెళ్ళాలనే కోరిక ఉంది. తల్లి పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలోని సొంత ఊరైన కుందాపూరకు తీసుకెళ్లారు ఎన్టీఆర్‌. అలాగే ఉడిపి శ్రీకృష్ణమఠానికి తీసుకెళ్లారు. ఈ దైవదర్శనంలో రిషభ్‌శెట్టి సాయం చేశాడట. ఎన్టీఆర్‌ తన ఫ్యామిలీతో కలిసి వస్తున్నాడని తెలియడంతో ప్రశాంత్‌ నీల్‌ కూడా అక్కడికి వచ్చారు. ఇలా అందరూ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. తనను అక్కడికి తీసుకెళ్లడం తన తల్లి చిరకాల కోరిక అని, దాన్ని తీర్చడం, అది కూడా తన బర్త్‌ డేకి ఓ రోజు ముందే ఇలా జరగడం ఆనందంగా ఉంది అని ఎన్టీఆర్‌ వేసిన ట్వీట్‌, షేర్‌ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా నిర్మాత విజయ్‌ కిరగందుర్‌, ప్రశాంత్‌ నీల్‌, రిషబ్‌శెట్టిలకు ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here