ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం..

గుంటూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడ నగరంపై అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదే సమయంలో.. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉందని అధికారులు వివరిస్తున్నారు. విజయవాడలో పదికిపైగా ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. బెజవాడ రోడ్లన్నీ వాగుల్లా మారాయి. ఇబ్రహీంపట్నం దగ్గర జాతీయ రహదారి నీట మునిగింది. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎటూ కదల్లేని పరిస్థితి నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాహనాలను దారి మళ్లిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here