నిండు కుండల్లా చెరువులు..

వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలకు చెరువులు నిండు కుండల్లా మారాయి. అనేక చెరువులు మత్తడి పోస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. చెరువుల్లో మత్తడి పోసే పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ.. ఉన్నతాధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. మరో రెండ్రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here