విమానంలో మొత్తం 173 మంది

విమానంలోని ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో విమానయాన సంస్థ తెలిపింది. ఆ విమానంలో సిబ్బందితో సహా మొత్తం 173 మంది ఉన్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. శుక్రవారం రాత్రి కోల్ కతా విమానాశ్రయంలో విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే 6ఈ 0573 విమానం పైలట్ ఎమర్జెన్సీ ఇంజిన్ ఫెయిల్యూర్ అయినట్లు సమాచారం ఇవ్వడంతో రాత్రి 10:39 గంటలకు పూర్తి ఎమర్జెన్సీ డిక్లరేషన్ ఇచ్చారు. వెంటనే రన్ వేను పరిశీలించి రెండు రన్ వే లను పైలట్ కు అందుబాటులో ఉంచారు. దాంతో, విమానం సింగిల్ ఇంజన్ తోనే సేఫ్ గా ల్యాండ్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here