మనం ఏ ఆహారం తిన్నా అది మనకు శక్తిని, అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ నోటి ద్వారా లోపలికి చేరిన ఆహారం జీర్ణమై శక్తిగా మారడానికి సుదీర్ఘ ప్రక్రియ శరీరంలో జరుగుతుంది. మనం తినే ఆహారం ప్రభావం దీని మీద ఉంటుంది. అందుకే సులువుగా జీర్ణమై, శరీరానికి మేలు చేసే ఆహారాన్నే తీసుకోవడం మంచిది. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, విత్తనాలు వంటివి జీర్ణం కావడానికి వేర్వేరు సమయాలు పడతాయి.