(6 / 6)
భారీ వర్షాలు, వరదల కారణంగా రైళ్లు రద్దు, దారి మళ్లింపుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, రాయనపాడు, కొండపల్లి రైల్వే స్టేషన్లలో వేలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ఉండిపోయారు. ట్రైన్లో హైదరాబాద్ వెళ్తుండగా.. దాన్ని మహబూబాబాద్లో ఆపేశారు.