చిగురుటాకుల్లా వణికిపోతున్న పల్లెలు..

కేవలం విజయవాడ నగరమే కాదు.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పల్లెలు, పట్టణాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. ఏలూరు నగరంలోని అనేక కాలనీలు నీట మునిగాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. ఇక విజయవాడ, గుంటూరు నగరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ చూసినా నాలుగైదు అడుగుల మేర నీరు నిలిచింది. విజయవాడ, గుంటూరు నగరాల్లో అనేక కాలనీలు వర్షపు నీటిలోనే నానుతున్నాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరి.. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here