రెండు మూడు రోజుల శిక్షణ అనంతరం క్షేత్రస్తాయిలో గ్రామాల వారిగా పశువుల సంఖ్య ఎంత, గతంలో కంటే గ్రామాల వారిగా ఎంత పశువులు సంతతి పెరిగింది అన్న అంశాలపై వివరాలు సేకరించనున్నారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుండి పశు గణన కార్యక్రమం చేపట్టనుండగా.. ఎన్యుమరేటర్లు యాప్‌లో నమోదు కోసం ప్రతీ ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఈ మొబైల్ యాప్‌లో ఇంటి యజమాని వివరాలతో పాటు యజమానికి ఉన్న భూమి వివరాలు, పశువుల వివరాలు, పాడి పశువులు ఎన్ని, జెర్సీ, దేశీ ఆవులు, గేదెలు, గొర్రె లు, మేకలు, తదితర పాడి పరిశ్రమకు సంబంధించి వివరాలు ప్రత్యేకంగా సేకరించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here