సెప్టెంబర్ నెలలోనే..

1831లో అసఫ్‌ జాహీ నాలుగో మీర్‌ ఫరుకుందా అలీఖాన్‌ నాసరుదౌలా పాలనా సమయంలోనూ.. భాగ్యనగరంలో భారీ వరదలు సంభవించాయి. అప్పుడు నిర్మాణంలో ఉన్న చాదర్‌ఘాట్‌ వంతెన కొట్టుకుపోయింది. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ పాలనా కాలం 1903లో సెప్టెంబర్‌ నెలలోనే భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. 1968, 1984, 2000, 2007, 2016, 2020 సంవత్సరాల్లోనూ భారీ వర్షాలు కురిసి మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. అప్పుడు కూడా భారీగా నష్టం వాటిల్లిందని చరిత్ర చెబుతోంది. వేర్వేరు నెలల్లో వర్షాలు వచ్చినా.. సప్టెంబర్‌లో వచ్చిన వర్షాలే చాలా ఎక్కువ కావడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here