ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో
రుద్రారం గ్రామానికి చెందిన సావిత్రి (28) ఆంజనేయులు భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు జస్వంత్ (5), ఇద్దరు కూతుర్లు చిన్మయి, చిత్ర (3). వీరు ఇద్దరు కవల పిల్లలు. ఆంజనేయులు ఇస్నాపూర్ లో బైక్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆంజనేయులు తాగుడుకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. నిత్యం మద్యం సేవించి భార్యతో గొడవ పెట్టుకునేవాడు. సావిత్రి పని చేసుకుంటూ పిల్లలను పోషించేది. తాగుడుకు బానిసైన ఆంజనేయులుకు రెండు కిడ్నీలు పాడైపోయినాయి. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్త చికిత్సకు అయ్యే ఖర్చులు భరించలేక, పిల్లలను పోషించలేక ఇబ్బంది పడేది. ఈ క్రమంలో ఐదు సంవత్సరాలు కూడా నిండని పసిపిల్లలను పోషించలేని పరిస్థితి ఆమెది. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కుటుంబ సమస్యలతో తీవ్ర మనోవేదనకు గురయ్యేది.