తాజాగా బుడమేరు పొంగడంతో సింగ్నగర్, చిట్టీనగర్, ఇతర కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపై 5 అడుగుల మేర నీరు నిలిచిపోయింది. దీంతో మంత్రులంతా వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో పాటు మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర, అధికార యంత్రాంగం వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులను పరామర్శిస్తున్నారు. నీట మునిగిన కాలనీల్లో జనాన్ని కలిసి ఇబ్బందులను పరిష్కరిస్తున్నారు. వరదలో భయపడొద్దని, అండగా ఉంటామని మంత్రులు భరోసా ఇస్తున్నారు.