CM Chandrababu : ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నిన్నటితో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయన్నారు. రహదారులపై నీటికి బయటకు పంపడమే కాదు….కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని, ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలన్నారు. 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం గత రెండు రోజుల్లో పడిందన్నారు.
Home Andhra Pradesh కాలనీలు, ఇళ్లలో చేరిన వరద నీటి సమస్యను తక్షణమే పరిష్కరించండి- సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు-amaravati...