కృష్ణా జిల్లా గుడివాడలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి పేర్నినాని కారుపై జనసేన నాయకులు, కార్యకర్తలు రాళ్లు, కోడి గుడ్లతో దాడి చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. గుడివాడలోని వైసీపీ నేత తోట శివాజీ ఇంటికి పేర్ని నాని వచ్చారు. ఈ సమయంలో దాడి జరిగింది. రాళ్ల దాడిలో పేర్ని నాని కారు అద్దాలు పగిలిపోయాయి. పవన్‌పై అనుచితవ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here