ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. భారీ వర్షాలపై సమీక్షించిన సీఎం చంద్రబాబు రేపు(సోమవారం) విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. సహాయక చర్యల కోసం అవసరమైతే హెలీకాప్టర్లు పంపుతామన్నారు. బాధితులను తక్షణమే ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు బాధితులకు ఇస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులు, చేనేతలకు అదనంగా 50 కేజీల బియ్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here