ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడానికి ‘ఆయ్’ (Aay) మూవీ టీం ముందుకు వచ్చింది. నేటి నుంచి వీకెండ్ వరకు సినిమాకి రానున్న వసూళ్ళలో ప్రొడ్యూసర్ షేర్ లో 25 శాతాన్ని జనసేన పార్టీ ద్వారా విరాళం అందజేయనున్నట్లు టీం ప్రకటించింది. (AP Floods)

నార్నే నితిన్ (Narne Nithin), నయన్ సారిక, రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆయ్. అంజి కె. మణిపుత్ర దర్శకుడు. జీఏ పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 16న విడుదలైంది. ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి వసూళ్లతో ఘన విజయం సాధించింది. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here