పెను ప్రమాదం..
ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తున్న నేపథ్యంలో.. పెను ప్రమాదంజరిగింది. బ్యారేజ్ 3,4 గేట్లను మూడు బోట్లు ఢీకొన్నాయి. 40 కి.మీ వేగంతో బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొన్నట్టు తెలుస్తోంది. బోట్లు ఢీకొనడంతో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో అధికారులు అలెర్ట్ అయ్యారు. అటు శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లలో సాంకేతిక సమస్య వచ్చింది. 2, 3 గేట్ల ప్యానల్లో బ్రేక్ కాయిల్ కాలిపోయింది. వరద ఉధృతితో గేట్ల హైట్ పెంచుతుండగా ఈ ఘటన జరిగింది. బ్రేక్ కాయిల్స్ పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.