చెన్నైలో చిక్కిన కిలాడీ జంట
తమ వద్ద ఉన్న టెక్నాలజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. వారు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా నిర్ధారించుకున్నారు. అనంతరం వారి లొకేషన్ ను ఐపీ అడ్రస్ ల ద్వారా ఫైండౌట్ చేసి, సైబర్ క్రైమ్ సిబ్బంది తమిళనాడులోని చెన్నై నగరానికి వెళ్లారు. అక్కడ జసిల్, ప్రీతి ఇద్దరినీ అక్కడ సలయూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక జిల్లాలో కోర్టులో హాజరు పరిచి నిందితులను సోమవారం ఉదయం వరంగల్ పోలీస్ కమిషనరేట్కు తీసుకువచ్చారు. వారి నుంచి వివిధ బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డ్స్, చెక్ బుక్స్, పెన్ డ్రైవ్స్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరించారు. ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్న జంటను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్స్ ఏసీపీ విజయ్ కుమార్, సీఐ రవికుమార్, ఎస్సైలు చరణ్ కుమార్, శివ కుమార్, ఏఏవో సల్మాన్పాషా, కానిస్టేబుళ్లు రాజు, ఆంజనేయులు, దినేష్, అనూషను సీపీ అభినందించారు.