AP: కృష్ణా నదిలో వరద ఉద్ధృతికి విజయవాడ కరకట్ట పక్కన ఉన్న మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం నీట మునిగింది. గత రాత్రి అమరావతి రైతులు, అధికారులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆశ్రమంలోకి నీళ్లు చేరాయి. దీంతో అందులో చికిత్స పొందుతున్న వారిని ఆశ్రమం నిర్వాహకులు బయటకు పంపేస్తున్నారు.