(1 / 6)
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. యనమలకుదురు, పడమట, రామలింగేశ్వర్ నగర్, జక్కంపూడి, భవానీ పురం, ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతున్నారు. ముంపు నివారణ చర్యలను క్షేత్రస్థాయి నుంచే సీఎం పర్యవేక్షిస్తున్నారు.