భారీ వర్షం, వరదలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అతలాకుతలం చేశాయి. ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, కరెంట్ షాక్ తో మహిళ మృతి చెందారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్ళలోకి నీళ్ళు చేరి పంట పొలాలు నీట మునిగి భారీగా ఆస్తి నష్టం సంభవించింది.