73 చెరువులకు గండి..
రాష్ట్రంలోని ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో 73 చెరువులకు గండ్లు పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లాలో 61 చెరువులు, గుంటూరు జిల్లాలో నాలుగు చెరువులు, ఏలూరు జిల్లాలో ఎనిమిది చెరువులకు గండ్లు పడ్డాయి. బుడమేరు వాగుకు ఆరు చోట్ల భారీగా గండ్లు పడ్డాయి. 154 ప్రాంతాల్లో రోడ్లపైన నీరు పారింది. 165 ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించారు. 18 ప్రాంతాల్లో రోడ్లు వరదలకు కోతకు గురయ్యాయి.