భయాందోళనలో సమీప గ్రామాలు
మదనపల్లి శివారులో అంతంత మాత్రమే అటవీ ప్రాంతం ఉండటం, అక్కడే చిరుత పులి అడుగుల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తం అవుతోంది. దీంతో ప్రేమ్ నగర్, మదనపల్లి, జాకారం, మాన్ సింగ్ తండా ప్రజలు తమ గ్రామ సమీప అడవుల్లోకి వెళ్ళొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పశువుల కాపర్లు పొలాల వద్దకు వెళ్లే కూలీలకు పాదముద్రలు, చిరుత ఆనవాళ్లు కనిపిస్తే ఫారెస్ట్ అధికారులకు 98493 58923, 94408 10881 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.